తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు.
చిత్తూరు: తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూప్ ఛైర్మన్ షేక్ నౌహీరా ఆరోపించారు. షేక్ నౌహీరాను సీఐడీ అధికారులు 9 వ అదనపు కోర్టులో ప్రవేశ పెట్టిన సందర్భంగా నౌహీరా కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు తన కాళ్లు, చేతులు కట్టేసి డిపాజిట్లు చెల్లించమంటే ఎలా?అని ప్రశ్నించారు. ఇప్పుడు తాను వున్న పరిస్థితుల్లో అది సాధ్యంకాదన్నారు. తన కంపెనీలో డిపాజిట్దారులు 15 ఏళ్లుగా లబ్ధి పొందుతున్నారనీ.. బంగారు నగలపైనే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇచ్చామని, కాబట్టి కంపెనీ వాళ్లెవరూ నష్టపోరనీ నౌహీరా తెలిపారు.