వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివేక కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివేక కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టంలో ఈ ఐదు అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలని కూడా పోలీసులు.. డాక్టర్లను కోరారు. విచారణ నిష్పక్షపాతికంగా జరగాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను కోరారు.
Read Also: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు
2019, మార్చి 15 తేదీ శుక్రవారం పులివెందులలోని ఆయన నివాసంలోని బాత్రూంలో వైఎస్ వివేక రక్తపు మడుగులో పడి ఉన్నారు. గుండెపోటుతో చనిపోయారని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత శరీరంపై ఉన్న గాయాలతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అనుమానం ఒకటి : బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండడం.
అనుమానం రెండు : బెడ్ రూం దగ్గర రెండు లీటర్ల రక్తం ఉండడం.
అనుమానం మూడు : వివేకనందరెడ్డి తలపై గాయం ఉండడం.
అనుమానం నాలుగు : తల వెనక భాగంలోనూ గాయం ఉంది.
అనుమానం ఐదు : అరచేతిపై బలమైన గాయం ఉంది.
ఈ ఐదు అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి ఎలా మృతి చెందారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.