jammu kashmir: జమ్మూకశ్మీర్లో బ్యాంకు మేనేజర్పై కాల్పులు జరిపి చంపిన ఉగ్రవాదులు
ఇటీవలే ఓ టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో ఉద్యోగిని ఉగ్రవాదులు చంపడం గమనార్హం. మూడు రోజుల్లో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది.
jammu kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ బ్యాంకు మేనేజర్పై కాల్పులు జరిపి చంపారు. హిందూ ఉద్యోగులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఓ టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో ఉద్యోగిని ఉగ్రవాదులు చంపడం గమనార్హం. మూడు రోజుల్లో చోటు చేసుకున్న రెండో ఘటన ఇది.
Arvind Kejriwal: మా అందరినీ అరెస్టు చేసేయండి: కేజ్రీవాల్
రాజస్థాన్లోని హనుమగఢ్ జిల్లాకు చెందిన విజయ కుమార్ ఇలాహే దెహాతీ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయనను ఇటీవలే జమ్మూకశ్మీర్లోని కుల్గాంలోని బ్యాంకుకు బదిలీ చేశారు. అందులో గురువారం కుమార్ విధులు నిర్వహిస్తుండగా వచ్చిన ఓ ఉగ్రవాది ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయాడు. అనంతరం కుమార్ను బ్యాంకు సిబ్బంది ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కుమార్పై ఉగ్రవాది దాడి చేసిన ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ
ఉగ్రవాది కోసం గాలిస్తున్నాయి. జమ్మూలో రెండు రోజుల క్రితమే ఓ హిందూ టీచర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కశ్మీర్ పండిట్లపై జరుగుతోన్న దాడులను అరికట్టి, తమకు రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు, ఇదే సమయంలో ఉగ్రవాదులు హిందువులపై దాడులు కొనసాగిస్తూ రెచ్చిపోతుండడం గమనార్హం.