Srisailam Dam: కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్ల ఎత్తివేత
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. దీంతో మరికాసేపట్లో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానం వారు కృష్ణమ్మకు సారే సమర్పిస్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నారు.
Srisailam Dam: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. దీంతో మరికాసేపట్లో శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లను తెరవనున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానం వారు కృష్ణమ్మకు సారె సమర్పిస్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తనున్నారు.
YouTube: అబార్షన్లు చేసే ప్రక్రియపై తప్పుడు సమాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చర్యలు
దీంతో నది పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక చేశారు. సైరన్ ద్వారా లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నాగార్జునాసాగర్కు నీటిని విడుదల చేయనున్నారు. కాగా, మరి కొన్ని అడుగులు పెరిగితే డ్యామ్ నీటి మట్టం గరిష్ఠస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. మరో రెండు రోజులపాటు భారీ స్థాయిలో వరద కొనసాగే అవకాశం ఉంది.