Telangana Covid News : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 29వేల 873 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 22వేల 667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 095కి తగ్గింది.
Telangana Covid News : తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. క్రితం రోజుతో(265) పోలిస్తే కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 27వేల 348 మందికి కరోనా పరీక్షలు చేయగా, 406 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 177 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 29వేల 873 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 22వేల 667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 095కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 17వేల 521 మందికి కరోనా పరీక్షలు చేయగా, 265 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.16.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Cmid0n90Hs— IPRDepartment (@IPRTelangana) August 16, 2022