నార్సింగిలో డ్రగ్స్ వ్యవహారం కేసులో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

Narsingi case: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇద్దరు..

నార్సింగిలో డ్రగ్స్ వ్యవహారం కేసులో వెలుగులోకి మరిన్ని కీలక విషయాలు

Narsingi-case

హైదరాబాద్ శివారులోని నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు.

హైదరాబాద్‌లో ఏడు పబ్బుల యజమాని నిఖిల్ ధావన్ అరెస్ట్ అయ్యాడు. అతడి వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఆరాతీస్తున్నారు పోలీసులు. నిఖిల్ ధావన్ పదే పదే ముంబై, దుబాయ్, అమెరికాకు వెళ్లి వస్తుంటాడని గుర్తించారు. అతడికి పలువురు డీజేలతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత వారం రోజుల్లో నాలుగు పబ్బుల డీజేలను పోలీసులు అరెస్టు చేశారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ సిస్టల్ కంపెనీ యజమాని మధురాజు కూడా అరెస్టు అయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటూ అతడు పోలీసులకు చిక్కాడు. కాగా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇద్దరు రియల్ ఎస్టేట్ యజమాలను కూడా అరెస్టు చేశారు.

Also Read: 65M/123 రూట్ నంబర్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ చేతిలో వేధింపులకు గురైన హైదరాబాద్‌ అమ్మాయి