ఇండియన్లంతా హిందువుల వారసులే: భగవత్

ఇండియన్లంతా హిందువుల వారసులే: భగవత్

Hindu ancestors: ఇండియాలో ఉన్నవారంతా పూర్వం ఇక్కడ ఉన్న హిందువుల వారసులే. ఇండియన్లలో ఏ ఒక్కరూ విదేశీయులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. ‘బ్రిటీష్ వారు దేశాన్ని విడగొట్టాలని భావించి.. ముస్లిం కమ్యూనిటీ అనే విభేదాలు సృష్టించారు. అందరినీ ఇదే కోరుతున్నా. అంతా ఏకత్వంతో ఉంటే దేశం డెవలప్ అవుతుందని’ చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారకులు, సివిలియన్ స్టడీస్ సెంటర్ డైరక్టర్ రవిశంకర్ రాసిన ‘హిస్టారికల్ పీరియడ్ కౌంటింగ్: యాన్ ఇండియన్ డిస్కోర్స్’ పుస్తక లాంచింగ్‌లో పాల్గొన్నారు. బలవంతమైన దేశాలు బలహీనమైన దేశాల మీద అధికారం చెలాయించాలనుకుంటాయి. దానికి ఎటువంటి ఉదాహరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఆర్ఎస్ఎస్ చీఫ్.. ఇంకా మాట్లాడుతూ.. ఏ ఇండియన్ మన చరిత్ర మరిచిపోకూడదు. ఎంతో విలువైన సంప్రదాయాలు, ఆచారాలు మరిచిపోతున్నారు. విస్మరిస్తున్నారు. భారతదేశంలో పాతుకుపోయిన వ్యవసాయ సంప్రదాయాన్ని ఉదహరణగా చూపించారు. ఉన్నత చదువులు చదివిన కుటుంబం వ్యవసాయానికి ఎలా అంకితమైపోయిందో ఉదహరణగా చూపించారు.