మైనర్‌తో సహా ఒకే కుటుంబంలోని నలుగుర్ని రేప్

మైనర్‌తో సహా ఒకే కుటుంబంలోని నలుగుర్ని రేప్

Rajasthan: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని వ్యక్తిపై నలుగుర్ని రేప్ చేసినట్లుగా కేసు నమోదైంది. మైనర్ బాలికను కూడా వదిలిపెట్టని నిందితుడు కుటుంబానికి దగ్గర్లో ఓ ధాబా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అందిన సమాచారం ప్రకారం.. విష్ణు గుర్జార్ అనే నిందితుడు తనను రేప్ చేసినట్లు మహిళ కంప్లైంట్ చేసింది.

తన చెల్లెళ్ల ఇద్దరినీ కూడా ట్రాప్ చేస్తున్నట్లుగా గుర్తించి మహిళ పోలీస్ కంప్లైంట్ చేసింది. చెల్లెళ్లతో పాటు మైనర్ బాలికను కూడా నిందితుడు వల్ల నష్టపోయిందని ఆ తర్వాత గానీ తెలిసింది. అక్క ఓపెన్ అవడంతో ఫ్యామిలీలో మిగిలిన వారు వెళ్లి కంప్లైంట్ చేశారు.

జనవరి 21న మొదటి కంప్లైంట్ నమోదు కాగా.. అదే రోజు ఆమె చల్లి పోలీసులను అప్రోచ్ అయింది. మిగిలిన కుటుంబ సభ్యులు.. తర్వాత పోలీసులను కలిసి తమకు జరిగిన అన్యాయం చెప్పుకున్నారు. జనవరి 23, జనవరి 24న విష్ణు అనే వ్యక్తిపై మరో 2రేప్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.