Blasting in Kadapa: ఘోరం.. కడప జిల్లాలో బ్లాస్టింగ్.. ఏడుగురు మృతి

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్ధాల విస్ఫోటనంతో పదిమంది అక్కడిక్కడే మరణించారు.

Blasting in Kadapa: ఘోరం.. కడప జిల్లాలో బ్లాస్టింగ్.. ఏడుగురు మృతి

Blasting In Kadapa District Ten People Killed

Blasting in Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు పదార్ధాల విస్ఫోటనంతో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ళ గని వద్ద ఈ పేలుడు ప్రమాదం జరిగింది. రాళ్లను పగలగొట్టేందుకు సహజం ఇక్కడ జిలిటెన్ స్టిక్స్ వాడుతుంటారు. ఈ గనిలో కూడా ముగ్గురాయిని తొలగించేందుకు జిలిటెన్ స్టిక్స్ వాడుతున్నారు. బయటనుండి గని వద్దకు వాహనంలో తెచ్చిన జిలిటెన్ స్టిక్స్ ను దింపుతుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారి బ్లాస్ట్ కావడంతో భారీ ప్రమాదం సంభవించింది.

ఈ పేలుడు ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు మరణించినట్లు తెలుస్తుండగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. చనిపోయిన వారంతా రోజువారీ కూలీలుగానే తెలుస్తుంది. జిలిటెన్ స్టిక్స్ పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలవగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.