Tollywood Stars : చిన్న స్క్రీన్‌పై.. పెద్ద రెమ్యూనరేషన్..

మంచి ఛాన్స్ రావాలే గానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు టీ టౌన్ స్టార్స్.. అది బిగ్ స్క్రీనా.. స్మాల్ స్క్రీనా.. ఓటీటీనా అన్నది పెద్దగా థింక్ చేయట్లేదు..

Tollywood Stars : చిన్న స్క్రీన్‌పై.. పెద్ద రెమ్యూనరేషన్..

Tollywood Stars

Tollywood Stars: మంచి ఛాన్స్ రావాలే గానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు టీ టౌన్ స్టార్స్. అది బిగ్ స్క్రీనా.. స్మాల్ స్క్రీనా.. ఓటీటీనా అన్నది పెద్దగా థింక్ చేయట్లేదు. మంచి రెమ్యూనరేషన్ అందుతుంది. ఒకవేళ బుల్లితెరపై బంపర్ హిట్ కొడితే.. అంతకు మించిన పేరొస్తుంది. ఇంక లేటేందుకు.. కుమ్మేద్దాం అని స్మాల్ స్క్రీన్‌పై సందడి చేస్తోన్న స్టార్స్ పై ఓ లుక్..

బ్రేక్ ది రూల్స్ అంటున్నారు టాలీవుడ్ స్టార్స్. టీవీ ఛానలైనా.. ఓటీటీ ప్లాట్ ఫాం అయినా.. సూపర్ ఆఫర్ వస్తే స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు ఇప్పుడు పెద్దగా ఆలోచించట్లేదు. రీసెంట్‌గా హీరోయిన్ తమన్నా ఓ కుకింగ్ షో లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. మాస్టర్ చెఫ్ తరహాలో ఓ తెలుగు టీవీ ఛానల్ స్టార్ట్ చేయబోతున్న కుకింగ్ కాంపిటీషన్‌కి జడ్జిగా కనిపించేందుకు ఎస్ చెప్పారు తమన్నా. స్మాల్ స్క్రీన్.. మిల్కీబ్యూటీకి కొత్తేమీ కాదు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ‘లెవెంత్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ సిరీస్‌తో ఆల్రెడీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేసింది తమన్నా.

ఈమధ్యే డీగ్లామరస్ రోల్‌తో మెప్పించారు సమంత. క్యారెక్టర్ పరంగా ఎన్ని విమర్శలెదురైనా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లోని రాజీ రోల్.. సామ్‌ని పాన్ ఇండియా హీరోయిన్‌ని చేసింది. దీంతో మరో ఓటీటీ ప్లాట్ ఫాం ఇప్పుడు సమంతను మరో వెబ్ సిరీస్ కోసం అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నట్టు టాక్. ఇక బిగ్ బాస్ స్పెషల్ ఎపిసోడ్‌తో పాటూ ఆహా ఓటీటీలో ‘సామ్ జామ్’ తో సైతం మంచి పేరు తెచ్చుకున్నారు సామ్.

లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు కాజల్ కిచ్లూ. త్వరలోనే మారుతి డైరెక్షన్లో ‘ఆహా’ కోసం మరో వెబ్ సిరీస్‌కి వర్క్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంతేకాదు హై రెమ్యునరేషన్‌తో.. ఓ హారర్ సిరీస్‌ను కాజల్‌కు ఆఫర్ చేస్తుంది ప్రముఖ ఓటీటీ. హీరోయిన్లే కాదు హీరోలు కూడా స్మాల్ స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరో రానా కొన్నేళ్ల నుంచి ‘నెంబర్ 1 యారీ’ ప్రోగ్రామ్‌తో యాంకర్‌గా సక్సెస్ అవుతున్నారు. రీసెంట్‌గా ‘సౌత్ బే లైవ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు.

బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ హోస్ట్‌గా అదరగొట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌తో రానున్నారు. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కోసం ఇలా బిగ్ డెసిషన్ తీసుకుంటున్నారు తారక్. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్‌తో నాని మెప్పిస్తే.. థర్డ్ సీజన్ నుంచి హోస్ట్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నారు నాగార్జున. అలాగే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో నాగ్, చిరులు బుల్లితెరపై హల్‌చల్ చేశారు.

ఫేడవట్ అవుతోన్న స్టార్స్‌కే బుల్లితెర అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, సమంతా, రానా, నాగార్జున వంటి స్టార్స్ చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలే ఉన్నాయి. అయినా సరే మంచి డీల్ అనుకుంటే ఓటీటీలకు, టీవీ ఛానల్స్‌కు ఎస్ చెప్పేస్తున్నారు. అటు తమన్నా, కాజల్ లాంటి వారు కూడా మిడ్ రేంజ్ సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ స్టార్స్‌‌కు వస్తోన్న స్మాల్ స్క్రీన్ ఆఫర్స్ వాళ్లకి మరింత బూస్టప్ ఇచ్చేవే.