దాస‌రికి ప‌ద్మ పురస్కారం.. చిరంజీవి విజ్ఞ‌ప్తి

దాస‌రికి ప‌ద్మ పురస్కారం.. చిరంజీవి విజ్ఞ‌ప్తి

Chiranjeevi

Chiranjeevi Request:ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణరావుకి ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ంటూ మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. దర్శకత్వంలోనూ.. తెలుగు సినిమా పరిశ్రమలోనూ.. తనదైన ప్రతిభతో పేరు తెచ్చుకుని, ఇండస్ట్రీకి పెద్దగా నిలబడ్డ దాసరి జయంతి సంద‌ర్భంగా గుర్తు చేసుకున్న చిరంజీవి.. స్మృత్యంజ‌లి అంటూ ట్వీట్ చేస్తూ పద్మా పురస్కారం ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు.

‘విజ‌యాలలో ఒక‌దానికి మించిన చిత్రాల‌ను మరెన్నో త‌న అపూర్వ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో మ‌ల‌చ‌డ‌మే కాదు.. నిరంత‌రం చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ మార్గ‌ద‌ర్శ‌క‌మే. శ్రీ దాస‌రికి ఇప్ప‌టికీ త‌గిన ప్ర‌భుత్వ‌ గుర్తింపు రాక‌పోవ‌డం ఒక తీర‌ని లోటు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఆయన‌కు ఇప్ప‌టికైనా (మ‌ర‌ణానంత‌రం) విశిష్ట‌మైన ప‌ద్మ పురస్కారం ద‌క్కితే అది మొత్తం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ద‌క్కే గౌర‌వం అవుతుంద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలో దాసరి జయంతిని డైరెక్టర్స్ డే గా జరుపుకుంటూ ఉండగా.. ఇప్పటివరకు ఆయనకు పద్మ లాంటి అత్యున్నత పురస్కారం మాత్రం దక్కలేదు. చిరంజీవి రిక్వెస్ట్ చెయ్యగా.. ఈసారి రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం ఉంది.