Home » 10tv
క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా ప్రధానపొలాన్ని దమ్ముచేసేటప్పుడే పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువులను కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తరువాత నత్రజని, భాస్వరం,పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి.
శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు.
మొక్కజొన్నకు కత్తెర పురుగు మహమ్మారిలా తయారైంది. గత ఏడాది ఈ పురుగు దాడివల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే రబీలో మొక్కజొన్న సాగుచేసే రైతులు బయపడాల్సిన పనిలేదంటున్నారు శాస్త్రవేత్తలు.
డ్రాగన్ ఫ్రూట్ మొక్కను ఒకసారి నాటితే 25, 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. అందుకే నేల తయారీ దగ్గరి నుంచి పోల్స్, సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకునే వరకు నాణ్యతా ప్రమాణాలు పాటించారు. ఇక ఈ మొక్కలకు నీరు పెద్దగా అవసరం ఉండదు.
వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటినిని తొలిదశలోనే అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
పెసరను మధ్యస్థ నేలలు , ఎర్ర చెల్కా నేలలు, నల్ల రేగడి నేలల్లో సాగుచేసుకోవచ్చు. చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చాలా ముఖ్యం.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం వుంది. ఈ పంటలో విత్తే రకం అంటే, గింజ సైజును బట్టి విత్తన మోతాదు వుంటుంది. విత్తేముందు ఆఖరి దుక్కిలో నిర్ధేశించిన మోతాదులో ఎరువులను తప్పనిసరిగా వేయాలి.
ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
గొల్లపల్లి గామానికి చెందిన కొంత మంది రైతులు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో వంగ సాగుచేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ.. మం, ఆదాయం పొందుతున్నారు.