Home » 10tv
వ్యవసాయ భూములను లీజుకు తీసుకొని ప్రణాళిక బద్ధంగా ఏడాది పొడవునా ఆకుకూరల దిగుబడి వచ్చే విధంగా సాగుచేస్తూ ఉంటారు. వచ్చిన దిగుబడిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ.. ప్రతి రోజు వెయ్యి రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు.
రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు.
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.
మురుగునీరు నిలవని నేలలు, చౌడునేలలు తప్పా, తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగుచేయవచ్చు. ఎకరాకు 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే అయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడిని ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ చాలా ముఖ్యమైనది. సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి, పంట విత్తిన 48 గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లైతే మున్ముందు సమస్యలు తలెత్తవు.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.
పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసేవీలు ఏర్పడింది.
తొలకరిలో వేసిన స్వల్పకాలిక పంటలైన వరి, పెసర, మినుము పూర్తయిన చోట్ల, రెండవ పంటగా కందిని సాగుచేయవచ్చు. ఖరీఫ్తో పోలిస్తే రబీ దిగుబడులు నాణ్యంగా వుంటాయి. తొలకరిలో వేసిన కంది ఎక్కువ ఎత్తు పెరగటం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా వుంటుంది.
మార్కెట్ లో తైవాన్ జామ మొక్కలకు డిమాండ్ ఉండటంతో 8 ఏళ్లుగా ఈ మొక్కలను క్లోనింగ్ విధానంలో పెంపకం చేపడుతున్నారు. క్లోనింగ్ అంటే కత్తిరింపు. తల్లి మొక్కల నుండి లేత కొమ్మలు కత్తిరించి వాటిని కోకోపీట్ నింపిన ట్రేలలో నాటుతున్నారు.
ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్ లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర రూ. 10 వేలు పలికింది. రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు.