Home » Navaratri 2023
నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో భాగంగా మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఈ ఆనందకర ఘట్టాలను పలువురు తిలకించారు. 108మంది మహిళలు వీణానాదంతో మధురై మీనాక్షి అమ్మవారికి స్వరనీరాజనం పలికారు.
నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అనారోగ్యాలతో పాటు, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సువాసినులకు మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది అమ్మవారు.
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
రాజ్ కోట్ మహిళలు విన్యాసాలు చూస్తే నిజంగా ఆదిశక్తిలకు ప్రతిరూపమా అనేలా ఉన్నాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఒంటిచేత్తో బుల్లెట్ నడుపుతు..మరో చేత్తో కత్తులు తిప్పుతు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల్లోని 9 బెస్ట్ క్యారెక్టర్స్ లో నటించిన 9 మంది హీరోయిన్స్ ఫోటోలని, వారికి సంబంధించిన 9 ఎమోషన్స్ ని షేర్ చేస్తామని ఇటీవల ప్రకటించింది.
శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవరోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి' గా దర్శనం ఇస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి.
పరమశివుడికే అన్నదానం చేసింది 'శ్రీ అన్నపూర్ణా దేవి'. అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదు. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాసుల్ని కురిపిస్తుంది.
గాయత్రి మంత్రం జపిస్తే సమస్త దేవతలను ప్రార్థించినట్లే అని రుగ్వేదం చెబుతోంది. నవరాత్రుల్లో రెండవరోజు గాయత్రీ దేవిని పూజిస్తే విజయాలు సొంతం అవుతాయి.
మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.