Home » Resu Gurralu
సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించిన వైసీపీ.. సామాజిక సమీకరణాలతో చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందా? వర్గపోరుతో సతమతమవుతున్న టీడీపీ.. ఎన్నికల్లో ఆ ఇబ్బందులను అధిగమించగలదా?
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయి ప్రచారంతో దూసుకుపోతుండగా, కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
అటు సీతక్క.. ఇటు నాగజ్యోతి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఒకే తెగకు చెందిన వారు కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిమ్మకూరులోనే ప్రారంభించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు స్కెచ్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.
నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది.
సనత్నగర్లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజకీయ సమీకరణలు కూడా మారే చాన్స్ కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి కూడా కొడంగల్పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.