కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. లేటెస్ట్గా వచ్చిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,504మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,08,712 కు చేరింది.
కోవిడ్ నిర్ధారణ కోసం రాష్ట్రంలో 61,112 మందికి పరీక్షలు చేయగా.. 3,224మంది కోవిడ్ పాజిటివ్ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,58,951 కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 43,983 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
వైరస్ బాధితుల్లో కొత్తగా 32 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం చనిపోయినవారి సంఖ్య 6,256కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 66లక్షల 30వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా ప్రభుత్వం చెబుతుంది.