62 IAS Officers transferred
AP IAS Officers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీలో మొత్తం 62 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం (జూలై 20)న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్గా సీహెచ్. శ్రీదత్ను నియమించింది.
Read Also : TTD EO Syamala Rao : తిరుమలపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ ఎం.వి. శేషగిరి, హ్యాండ్లూమ్స్, టెక్స్ట్టైల్స్ కమిషనర్గా రేఖారాణి, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా చేవూరి హరికిరణ్ నియమితులయ్యారు. అలాగే సెర్ప్ సీఈవో గా వీర పాండ్యన్, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్గా మల్లికార్జున నియమితులయ్యారు.
కమిషనర్లు ఇలా..!
Read Also : హరీశ్ రావును ఒంటరిని చేసేలా పక్కా వ్యూహం.. గులాబీ పార్టీని ఖాళీ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు?