మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

non-bailable warrant issued against Kannababu and Ambati Rambabu : ఏపీ మంత్రి కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హెరిటేజ్‌ పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాని కన్నబాబు, అంబటిపై.. ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.

గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా, వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. గతంలో కూడా ఒకటి.. రెండు సార్లు కోర్టు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు