AP Fibernet Case: ఏపీ ఫైబర్‭నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి

114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.

AP Fibernet Case: ఏపీ ఫైబర్‭నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన టేరాసాఫ్ట్ యండి వేమూరి హరిప్రసాద్ అస్తులు అటాచ్‌మెంట్ చేయాలని సీఐడి దాఖలు చేసిన పటిషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఆస్తుల అటాచ్మెంటుకు అనుమతించింది. ఎండీ వేమూరి హరిప్రసాద్, టేరాసాఫ్ట్ ఎండీతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఎసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్ మెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.

మొత్తం ఏడుగురి అస్తులు
*ఏ7 తుమ్మల ప్రమీల, టేరాసాఫ్ట్ ఎండీ బార్య.
*ఏ9 తుమ్మల గోపీ చంద్, టేరాసాఫ్ట్ ఎండీ.
*ఏ11 టెరా సాప్ట్ కంపెనీ.
*ఏ23 నెట్ టాప్ కంపెనీ ఎండw కనుమూరి కోటేశ్వరరావు.