AIG Hospitals Vizag: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విశాఖలో రూ. 2000 కోట్లతో ఏఐజీ హాస్పిటల్.. శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospitals Vizag) సిద్ధమైంది.
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 09:26 PM IST
Aig hospitals visakhapatnam nara lokesh foundation stone lay
- విశాఖలో ఏఐజీ ఆస్పత్రి శంకుస్థాపన
- తొమ్మిది వేల మందికి కొత్త ఉద్యోగాలు
- అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల లభ్యత
AIG Hospitals Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రముఖ ఏఐజీ ఆస్పత్రి (AIG Hospitals Vizag) సిద్ధమైంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ హెల్త్కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు అనగా సోమవారం(ఆగస్టు 31) శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 9,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వైద్యరంగంలో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న ఏఐజీ హాస్పిటల్స్ రాకతో ఉత్తరాంధ్ర వైద్య సౌకర్యాలలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
9 ఎకరాల్లో అత్యాధునిక క్యాంపస్ – 50కి పైగా ప్రత్యేక విభాగాలు:
విశాఖపట్నంలో 9 ఎకరాల వైశాల్యంలో ప్రధాన ఆస్పత్రి క్యాంపస్ను, అలాగే మరో 2.5 ఎకరాల్లో అధునాతన నర్సింగ్ కళాశాలను ఏఐజీ యాజమాన్యం నెలకొల్పుతోంది. ఈ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను (మల్టీ స్పెషాలిటీస్) అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యుత్తమ వైద్య నిపుణులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు తక్కువ ఖర్చులోనే లభించనున్నాయి.
