జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులకు ఏపీలోకి అనుమతి…ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలింపు

జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.

  • Publish Date - March 25, 2020 / 08:13 PM IST

జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు.

హైదరాబాద్ నుంచి వచ్చి ప్రస్తుతం జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడున్న వారందరినీ ఏపీకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన విద్యార్థులను రాష్ట్రంలోకి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వారిని అనుమతించాలని సీఎం.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మెడికల్ ప్రోటోకాల్ తర్వాతే పోలీసులు వారిని అనుమతించనున్నారు. ఇప్పుడున్న వారు తప్ప కొత్తగా వచ్చేవారిని అనుమతించేది లేదని పోలీసులు అంటున్నారు. సీఎం ఆదేశాలు మేరకు ఇప్పుడు అక్కడ స్పాట్ లో ఉన్న వారందరినీ ఏపీలోకి అనుమతిస్తారు. అయితే మెడికల్ ప్రోటోకాల్ పాటించి మాత్రమే అనుమతిస్తారు. కొత్తగా ఎవర్ని అనుమతించరు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్‌ప్రోటో కాల్‌ కోసం అధికారులు వారిని తరలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. పగడ్బందీగా హెల్త్‌ ప్రోటోకాల్‌ను అధికారులు పాటిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలిస్తున్నారు. ఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వెస్ట్‌గోదావరి తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు. 

అంతకముందు హైదరాబాద్ లో హాస్టళ్ల మూసివేయడంతో విద్యార్థులు ఏపీ బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ వోసీతో విద్యార్థులు బయల్దేరారు. అంతకముందు పోలీసులు విద్యార్థులను ఏపీలోకి అనుమతించలేదు. ఏపీ, తెలంగాణ బోర్డర్ లో విద్యార్థులు అగచాట్లు పడ్డారు. 

ఏపీ, తెలంగాణ బోర్డర్ గరిపాడు చెక్ పోస్టు వద్ద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనల మధ్య నలిగిపోయారు. చెక్ పోస్టు దగ్గర ఏడు గంటలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీలోకి అడుగు పెట్టలేక, తెలంగాణకు తిరిగి వెళ్లలేక అవస్థలు పడ్డారు. ఎటు వెళ్లాలో తెలియక విద్యార్థులు సతమతం అయ్యారు. 

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మధ్య సంప్రదింపులు జరిగాయి. కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
 

ట్రెండింగ్ వార్తలు