జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండి: అంబటి రాంబాబు

జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదొద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు సలహాయిచ్చారు. జనసేనకు చంద్రబాబు ఎక్కువ సీట్లు ఇవ్వబోరని చెప్పారు.

చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చెయ్యలేదని, జగన్ అన్ని అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ టార్గెట్ 175.. పక్కా సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించబోదని, అతిగా ఆశలు పెట్టుకోవద్దని హితవు పలికారు. ”సీట్ల ముష్టి కోసం పవన్ రెండు సార్లు వెళ్లాడు. జనసైనికులు కుక్క తోక పట్టుకొని గోదారి ఈదకండి. 60 సీట్లు అని భ్రమల్లో ఉండకండి. ఏ 25 సీట్లో ముష్టి వేస్తాడ”ని అన్నారు.

టీడీపీ, జనసేన ఎన్నికలకు సిద్ధంగా లేవని.. ఇంకా సీట్ల లెక్కల్లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సింగిల్‌గా మీటింగ్స్ పెడితే జనం రావడం లేదని సినిమా యాక్టర్‌ను తీసుకుని వెళ్తున్నారని, లోకేశ్‌ను దాచేసారని అన్నారు. లోకేశ్‌ను దాచేసినా, బయట తిప్పినా ఒకటేనని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ను అర్జునుడు అంటే పవన్ కళ్యాణ్‌కు ఏంటి నొప్పి ఏంటని ప్రశ్నించారు. జగన్ అర్జునుడేనని, పద్మవ్యూహలను చేధించుకుని బయటకి వస్తారని అన్నారు.

బాలశౌరి బాపూన్.. చరిత్ర బయటపెడతా
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బాపూన్ అని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టే తమ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించిందని వెల్లడించారు. వైసీపీ టికెట్ ఇవ్వలేదని జనసేన పార్టీలో చేరారని తెలిపారు. ”బాలశౌరి జీవితం అంతా మాకు తెలుసు, మేము చెప్తాం. ఆయన పుట్టుక నుండి ఇప్పటి వరకూ నాకు అన్ని తెల్సు.. నేను చెప్తాన”ని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

Also Read: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ.. రెండు సార్లు అదే అంశంపై చర్చ..!

ట్రెండింగ్ వార్తలు