Sadarem Pension: ఏపీ దివ్యాంగులకు గుడ్ న్యూస్.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం(Sadarem Pension) సేవలను కూడా ఇందులోనే అందుబాటులోకి తెచ్చింది.
- V Santhosh Kumar
- Published on- August 4, 2026 / 08:57 PM IST
Andhra pradesh govt launches sadaram services on whatsapp mana mitra
- వాట్సాప్లోనే సదరం సేవలు
- ఫోన్లోనే స్లాట్ బుకింగ్
- మధ్యవర్తుల దోపిడీకి చెక్
Sadarem Pension: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ను విస్తరిస్తూ ప్రభుత్వ సేవలను ప్రజల చేతివేళ్ల వద్దకు తీసుకురావడంలో మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇప్పటికే ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల సేవలు అందిస్తుండగా, తాజాగా దివ్యాంగులకు అత్యంత కీలకమైన సదరం (Sadarem Pension) సేవలను కూడా ఇందులోనే అందుబాటులోకి తెచ్చింది. గతంలో సదరం సర్టిఫికెట్ లేదా స్లాట్ బుకింగ్ కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎదుర్కొన్న ఇబ్బందులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం చెక్ పెట్టింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను సులభతరం చేశారు.
E20 Petrol: E20 పెట్రోల్పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం
వాట్సాప్ ద్వారా ‘సదరం’ సేవలు పొందే సులువైన విధానం:
* దివ్యాంగులు తమ మొబైల్ నుంచే సేవలు పొందేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 కి ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
*తరువాత ‘Citizen Services’ ఆప్షన్లో ‘Sadaram Services’ ఎంచుకోవాలి.
*అక్కడ స్లాట్ లభ్యత తెలుసుకోవడం, ఖాళీలను బట్టి అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకోవడం చేయాలి.
*అక్కడ సర్టిఫికెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడం వంటి కీలక సదుపాయాలు లభిస్తాయి.
*ప్రయాణ ఇబ్బందులు పడే దివ్యాంగులకు ఈ విధానం సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.
పారదర్శకత – మధ్యవర్తుల ప్రమేయానికి స్వస్తి:
ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా మారుతుందని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. ఒకే వేదికపై స్లాట్ బుకింగ్ నుండి సర్టిఫికేట్ పొందే వరకు అన్ని వసతులు కల్పించడం దివ్యాంగులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఈ నూతన సదుపాయాన్ని రాష్ట్రంలోని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సూచించింది.
