Anil Kumar Yadav
Anil Kumar Yadav : సీఎం జగన్ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం.. తగ్గేదేలే..730 రోజులు కష్టపడుతాం.. కేబినెట్ లోకి వెళ్తాం..మంత్రిగా కన్నా.. జగన్ సైనికుడిగా ఉండడమే తనకు ఇష్టమని..తాను ఎవరికీ పోటీ కాదు.. నాకు నేనే పోటీనని అన్నారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. ఎవరితో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక్కడ ఉన్నది ఒక్కటే వర్గం అది జగన్ వర్గమన్నారు. తాము ఎవ్వరైనా గెలిచేది జగన్ బొమ్మతోనేనని వెల్లడించారు. 2024లో జగన్ ను మరోసారి సీఎం చేస్తామని ప్రకటించారు. 2022, ఏప్రిల్ 17వ తేదీ ఆదివారం కార్యకర్తలతో మాజీ మంత్రి అనీల్ ఆత్మీయ సభ నిర్వహించారు.
Read More : Kakani Govardhan Reddy : నెల్లూరులో హాట్ హాట్గా పొలిటిక్స్.. హై కమాండ్ సీరియస్ ?
అయితే.. ఇదే సమయంలో మంత్రిగా నియమితులైన కాకాణి నెల్లూరు జిల్లాకు రావడం.. ఆయన కూడా సభ నిర్వహించడంతో పొలిటికల్ హీట్ ను పెంచింది. దీనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. వివాదాస్పద వ్యాఖ్యలు, గొడవలు జరగకుండా సభ నిర్వహించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన సభలో అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…తొలి కేబినెట్ లోనే మంత్రి అవుతానని తాను అనుకోలేదని, వయస్సు అయిపోలేదు.. మళ్లీ అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పదవి లేదని ఎందుకు కుంగిపోతామని సూటిగా ప్రశ్నించారు.
Read More : AP : ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ
సీఎం జగన్ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనన్నారు. తాను వైసీపీ బలోపేతం కోసం పనిచేసినట్లు, యుద్ధానికి రాజు తాను నమ్మిన సైన్యాన్నే ముందు పంపిస్తారని, కేవలం ఈ సమావేశం కార్యకర్తల కోసం ఏర్పాటు చేసినట్లు స్పష్టతనిచ్చారు. మూడేళ్ల తర్వాత కార్యకర్తలతో తాను మనస్పూర్తిగా మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీకైనా.. సోషల్ మీడియాలో మాట్లాడే చెంచాలకైనా భయపడమని, తనకెప్పుడూ అండగా ఉన్న నెల్లూరు ప్రజల మధ్య ఉంటానని తెలిపారు.