AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గుతున్న కరోనా.. రికవరీ కేసులే ఎక్కువ

  • Publish Date - October 6, 2020 / 07:10 PM IST

AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 33 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,046 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.



రాష్ట్రంలో గత 24 గంటల్లో 65,889 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 5,795 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 33 మంది మృతిచెందారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 62,16,240 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఏపీలో కరోనా కేసులు 7,29,307 లక్షలపైన దాటేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 6,052 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 50,776 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,72,479 మంది (AP Covid Recovery cases) డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖ పట్నంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కడపలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.