ఏపీలో కరోనా తగ్గుముఖం.. వెయ్యి లోపే కేసులు

  • Publish Date - November 28, 2020 / 06:39 PM IST

AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.



ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 49,348 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వారిలో కొత్తగా 625 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,67,063లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.



కరోనా బారినపడి 5 మంది మరణించారు. 1,186 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 848511 మంది డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 99,62,416 మందికి శాంపిల్స్ పరీక్షించగా 11,571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6981కి చేరింది.



గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు మరణించారు.