AP High Court Denies to give interim orders over AP Tet and DSC Exam
AP High Court : టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఇవ్వలన్నా పిటిషన్ను ఏపీ హైకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 23) విచారణకు స్వీకరించింది. పరీక్షల షెడ్యూల్ మార్చాలనే పిటిషన్పై విచారించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. టెట్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవలే వరుసగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. ఈ రెండు పరీక్షలకు మధ్య సరైన సముచిత సమయం ఇవ్వకుండానే హడావిడిగా ప్రభుత్వం నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గడువు కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇటీవలే టెట్, డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్పై విచారించిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.