AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. ఏకంగా రూ. 192 కోట్ల అక్రమాలు.. వాసుదేవరెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం(AP Liquor Scam) రవాణా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది.

AP liquor scam Sensational details in Vasudeva Reddy remand report

  • మద్యం రవాణాలో భారీ కుంభకోణం
  • రూ. 192 కోట్ల అక్రమాలు
  • నిందితులకు 14 రోజుల రిమాండ్

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టుతో ఈ కేసు విచారణను సీఐడీ సిట్ అధికారులు వేగవంతం చేశారు. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్న కీలక వివరాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి.

New Airports In Telangana: మారుతున్న తెలంగాణ ముఖచిత్రం.. కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు.. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం రూ.496 కోట్ల నిధులు

సిట్ సమర్పించిన నివేదిక ప్రకారం, మద్యం (AP Liquor Scam)రవాణా టెండర్ల పేరుతో ఏకంగా రూ. 192 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండానే టెండర్ల విధానాన్ని పూర్తిగా మార్చేశారు. కిలోమీటరుకు రూ. 19.68గా ఉన్న చార్జీని ఏకంగా రూ. 35కు పెంచి దోపిడీకి పాల్పడ్డారు. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు బినామీ కంపెనీలను తెరపైకి తెచ్చారు. అప్పటి ఉపముఖ్యమంత్రి హెచ్చరించినా పట్టించుకోకుండా, కొత్త టెండర్లు లేకుండానే సిగ్మా కాంట్రాక్ట్ గడువును నాలుగుసార్లు పొడిగించారు.

ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రధాన సూత్రధారులు వాసుదేవరెడ్డి, రాజ్‌కేసిరెడ్డి, కారుమూరి సునీల్‌లకు ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్న నిందితులను సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌పై విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వీరందరినీ జైలుకు తరలించగా, ఈ కుంభకోణంలో మరికొందరు కీలక నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.