Ap PMAY Scheme: ఏపీ పేదలకు తీపి కబురు.. 4 లక్షల కొత్త ఇళ్లు మంజూరు.. వారంలోనే పట్టాల పంపిణీ!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Ap PMAY Scheme) పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- V Santhosh Kumar
- Updated on- August 29, 2026 / 08:59 PM IST
Ap pmay scheme central sanctions 4 lakh new houses financial aid details
- ఏపీకి 4 లక్షల ఇళ్లు
- ప్రభుత్వాల నుంచి 2.5 లక్షలు
- సొంత స్థలం ఉన్న పేదలు
Ap PMAY Scheme: ఆంధ్రప్రదేశ్లోని స్వంత ఇల్లు లేని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (Ap PMAY Scheme) పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల కేటాయింపు కోసం లక్షలాది మంది అర్హులు దరఖాస్తు చేసుకుని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో, వచ్చే వారం నుంచి 10 రోజుల్లోనే జిల్లాల వారీగా ఈ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఇది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
Vijayawada Tragedy: విజయవాడలో ఘోరం.. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు మృగాళ్లు అరెస్ట్
నూతన ఇళ్ల కేటాయింపు, పట్టణ పరిమితులు:
రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది నివాస స్థలాలు లేని పేదలను ప్రభుత్వం గుర్తించగా, తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల అర్హులకు ఈ 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే పరిశీలన పూర్తయిన దరఖాస్తుదారులకు త్వరలోనే పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, పట్టణ ప్రాంతాల్లో (PMAY-Urban 1.0) గతంలో మంజూరై పెండింగ్లో ఉన్న 3.71 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయితేనే కొత్త ఇళ్లకు ఆమోదం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేయడంతో, పట్టణాల్లో కొత్త ఇళ్ల కేటాయింపునకు కాస్త సమయం పట్టేలా ఉంది.
ఆర్థిక సాయం వివరాలు, దరఖాస్తు గడువు:
పీఎం ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2029 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే ప్రతి అర్హులైన పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు, రాష్ట్ర కూటమి ప్రభుత్వం రూ1.00 లక్షల ఆర్థిక సాయం అందించనున్నాయి. మొత్తంగా రూ.2.50 లక్షల ఆర్థిక బహుమతి లభించనుండటంతో, తగిన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
