హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్..!

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.

Shock For Ysrcp (Photo Credit : Google)

Hindupuram Ysrcp : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో హిందూపురం మున్సిపాలిటీని త్వరలో టీడీపీ కైవసం చేసుకోనుంది.

మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు.

తాజాగా 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ తరుపున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన 10మంది కలిపితే 18 మంది అవుతారు. మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉండటంతో మున్సిపాలిటిని సైకిల్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read : చంద్రబాబా మజాకా..! టీడీపీ కంచుకోటలో వైసీపీ కథ కంచికేనా? దారుణంగా దెబ్బతీసిన వైనాట్‌ 175..!

ట్రెండింగ్ వార్తలు