వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మేయర్ దంపతులు..!

వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు.

Shock For Ycp (Photo Credit : Google)

Eluru Mayor Shaik Noorjahan Resign : ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ అధినేత జగన్ కు తమ రాజీనామా లేఖ పంపారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. రేపు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు