Bonda Uma Maheswara Rao : న్యాయం చేయాలని అడిగితే రైతులపై కేసులు పెడతారా? : బోండా ఉమా ఫైర్

శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. డీజీపీ, హెచ్ఆర్సీకి టీడీపీ లేఖలు రాస్తుందని చెప్పారు.

Bonda Uma Maheswara Rao

TDP – Bonda Uma Maheswara Rao : రాష్ట్రంలో రైతులు బతకలేక పోతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. సీఎం తాడేపల్లి దాటి అడుగు ముందుకు వేయడం లేదని విమర్శించారు. వ్యవసాయ శాఖా మంత్రి అయితే పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అధికారులు పంట నష్టంపై అంచనాలు కూడా వేయడం లేదన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి కారుమురి సొంత నియోజకవర్గంలో రైతులకు న్యాయం చేయాలని అడిగితే భూతులు తిట్టారని పేర్కొన్నారు.

ఎర్రిపప్ప కారుమూరి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవుపలికారు. అధికారుల హడావుడి తప్ప రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. న్యాయం చేయాలని అడిగితే రైతులపై కేసులు పెడతారా అని నిలదీశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు.

Amaravati : తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. ఉరేసుకోబోయిన మహిళ రైతును అడ్డుకున్న పోలీసులు

కావలి డీఎస్పీ వ్యవహరించిన తీరుపై డీజీపీ, హెచ్ఆర్సీకి టీడీపీ లేఖలు రాస్తుందని చెప్పారు. ముందస్తు ఎన్నికలైనా వెనుక ఎన్నికలైనా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని పేర్కొన్నారు. వై నాట్ 175 అంటూనే పొత్తులు అనగానే ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. ‘మేము పొత్తుతో వస్తే మీకు ఎందుకు సింగిల్ వస్తే మీకు ఎందుకు’ అని అన్నారు. పొత్తులు టీడీపీకి కొత్త కాదన్నారు.

‘పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకు ఎందుకు? మీరు సింగిల్ గా వస్తారో లేక గోరంట్ల మాధవ్ లాగా ఆదిమూలపు సురేశ్ బట్టలు విప్పుకుని వెళ్తారో వెళ్ళండి’ అని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ఇవ్వగానే జగన్ పెంపుడు కుక్కలు ఎందుకు మోరుగుతున్నాయని ప్రశ్నించారు. ‘మీ పాలన వైఫల్యాలను ప్రశ్నించే ఇతర పార్టీల పొత్తుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు’ అని స్పష్టం చేశారు.