NV Ramana visit Anantapur : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ రెండు రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్ వి రమణ సతీ సమేతంగా పాల్గొననున్నారు.
ఈ నెల 21వ తేదీన పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొని రాత్రికి ప్రశాంతి నిలయంలో బస చేస్తారు. 22వ తేదీ సత్యసాయి విశ్వ విద్యాలయం 40వ స్నాతకోత్సవంలో జస్టిస్ యన్ వి రమణ దంపతులు ముఖ్య అథితులుగా పాల్గొననున్నారు.