కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు..

24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని డాక్టర్లు అన్నారు.

Jani Master Mother Ill : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాను అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఆమె నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకోకుండా అడ్డు పడ్డారని ఆవేదనతో జానీ తల్లి అస్వస్థతకు గురయ్యారని జానీ భార్య అన్నారు. జానీ మాస్టర్ ను అన్యాయంగా జైల్లో పెట్టారనే మానసిక వేదనతో బీబీ జాను కొన్ని రోజులుగా కుంగిపోయారని జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా తెలిపారు.

‘కొడుకుపై దిగులుతో మా అత్తకు స్ట్రోక్ వచ్చింది. తన కుమారుడిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆమె మనో వేదనకు గురైంది. ఫిర్యాదు చేసిన యువతి అన్నీ తప్పుడు ఆరోపణలు చేసింది. ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఓ యువకుడు ఆ యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా అనేక మంది బాధితులు కూడా బయటికి వస్తారు. యువతి వాట్సాప్ చాట్ బయటకు వస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి. జానీ మాస్టర్ పై కేసులో న్యాయపోరాటం చేస్తాం’ అని జానీ మాస్టర్ భార్య ఆయేషా అన్నారు.

”బాగోలేదని చెప్పి నాకు కాల్ చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. చెస్ట్ పెయిన్ ఎక్కువైందని చెప్పారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్లు తెలిపారు. తన కొడుకుని తప్పుడు కేసులో ఇరికించారని ఆమె బాగా టెన్షన్ పెట్టుకున్నారు. షుగర్ ఎక్కువైపోయింది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని డాక్టర్లు అన్నారు” అని ఆయేషా చెప్పారు.

 

Also Read : జగన్‌ గుడ్‌బుక్‌.. రెడ్‌బుక్‌కు కౌంటరేనా? క్యాడర్‌, లీడర్లలో భరోసా కల్పించే స్ట్రాటజీనా?