Corona cases reported heavily : ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 24 గంటల్లో 15 మంది మృతి చెందారు.
ఏపీలో ప్రస్తుతం 40,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 7,388 మంది మృతి చెందారు.
చిత్తూరు 1,051, తూర్పుగోదావరి 906, గుంటూరు 903, శ్రీకాకుళం 662, నెల్లూరు జిల్లాలో 624
చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.