చిత్తూరుజిల్లా వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ వైసీపీని వీడారు. వైసీపీ రాజకీయ సలహా కమిటీలో సభ్యుడిగా గాంధీ పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, దళిత ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్ఠానం అవమానాలకు గురిచేస్తోందంటూ ఆయన ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి అడుగులకు మడుగులు వచ్చే వారికి వైసీపీలో పదవులు లభిస్తున్నాయని చెప్పారు.
వైసీపీలో దళితులకు బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆ పార్టీలో చేరతానని అన్నారు. కాగా, ఆర్.గాంధీ 2013 డిసెంబరు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీ ఎన్నికల వేళ ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారారు.