విశాఖ జిల్లాలో తప్పిన ప్రమాదం – బస్సులో మంటలు

Fire broke out in a running bus at Payakaraopeta, visakha district : విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడబడ్డాయి. మంగళవారం ఉదయం ఒడిషా నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పాయకరావుపేట వై జంక్షన్ వద్దకు రాగానే బస్సులోంచి మంటలు చెలరేగి పొగరావటం మొదలైంది.

అది గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపి అందులోని ప్రయాణికులు అందరినీ కిందకు దించివేశాడు. కొద్ది సేపట్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. సమయానికి ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మండలను అదుపులోకి తెచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు