Ap Cabinet : ఏపీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కేబినెట్ బెర్తు కోసం టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. సీనియర్, జూనియర్ నేతలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం మాత్రం ప్రాంతీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మంత్రులను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇక బీజేపీ, జనసేన కూడా మంత్రివర్గంలో చేరే పరిస్థితి ఉండటంతో నేతల్లో టెన్షన్ ఎక్కువ అవుతోంది.
కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రమవుతోంది. కనీవిని ఎరుగని రీతిలో విజయం సాధించడం, కొంతమంది భారీ మెజార్టీలతో గెలుపొందడంతో మంత్రి పదవులపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ ఎప్పుడూ గెలవని సీట్లు, గతంలో పట్టు లేని చోట్ల రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసిన నేతలు.. కేబినెట్ లో తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలో పెద్దల ద్వారా తమ మనోగతాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి వర్గంలో గరిష్టంగా 25మందికి అవకాశం ఇవ్వొచ్చు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప, నెల్లూరు వంటి చిన్న జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి. ఇక విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని మూడు జిల్లాల నుంచి ముగ్గురేసి నేతలకు మంత్రులయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక్కో జిల్లా నుంచి నలుగురైదుగురు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి కళింగ సామాజికవర్గానికి చెందిన కూన రవికుమార్ తో పాటు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి కీలక నేత అచ్చెన్నాయుడికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, అచ్చెన్నాయుడు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అచ్చెన్నకు మంత్రి పదవిపై అనుమానాలు మొదలయ్యాయి. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే కోణంలో అధిష్టానం డైలమాలో పడింది అంటున్నారు. ఇక అచ్చెన్నకు అవకాశం దక్కపోతే ఆయన సామాజికవర్గానికి చెందిన మరో నేతలకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Also Read : ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం
పూర్తి వివరాలు..