Husband kills his wife and two children : విజయవాడ వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని సింగ్నగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.