దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏయే ఎమ్మెల్యేలకు ఎంతెంత ఆస్తి ఉంది? అన్న విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఓ రిపోర్టు విడుదల చేసింది. ముంబైలోని ఘట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షాకు దేశంలోని అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి.
ఆయన ఆస్తుల విలువ రూ.3,400 కోట్లు. ఆయన భారత్లోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే. ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, మంత్రి డీకే శివకుమార్ సంపద రూ.1,413 కోట్లకు పైగా ఉందని ఏడీఆర్ తెలిపింది. అందరికంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఆయన ఆస్తులు రూ.1,700 మాత్రమే.
ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది. 28 రాష్ట్రాల అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలోని 4,092 మంది ఎమ్మెల్యేల వివరాలు తీసుకుని ఈ నివేదిక రూపొందించింది.
ప్రముఖ నేతల ఆస్తులు
టాప్ 10 సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ నుంచే నలుగురు ఉన్నారు. టాప్ 20లో ఏపీ నుంచి మంత్రి నారా లోకేశ్, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేల సంపద మొత్తం కలిపి రూ.14,179 కోట్లుగా ఉంది. మహారాష్ట్రలోని 286 మంది ఎమ్మెల్యేల ఆస్తి మొత్తం కలిపి రూ.12,424 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 174 మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద రూ.11,323 కోట్లు. మరొకరి వివరాలు తెలియరాలేదు.
త్రిపుర ఎమ్మెల్యేల ఆస్తి తక్కువగా ఉంది. మొత్తం 60 మంది సభ్యుల ఆస్తి కలిపి రూ.90 కోట్లు, మణిపూర్లో 59 మంది ఎమ్మెల్యేల ఆస్తి రూ.222 కోట్లు, పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేల ఆస్తి రూ.297 కోట్లుగా ఉంది.
సగటు ఆస్తులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే
సగటు ఆస్తులు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు ఇవే