Kodali Nani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోటలో ఉన్నా ఒకటే పేటలో ఉన్న ఒకటేనని అని పేర్కొన్నారు. కరిచే కుక్క మొరగదు, మొరిగే కుక్క అరవదు అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడారు.
రూపాయి పావలా అని అంటున్నాడు అంటే అతనే తమ పార్టీకి 125 సీట్లు వస్తాయని, పావలా కళ్యాణ్ కి వారి ఉమ్మడి కూటమికి 25 సీట్లు వస్తాయని అర్ధం అని అన్నారు. పావలా కళ్యాణ్ కి 25, రూపాయి పావలా పార్టీ అన్న పార్టీకి 125 అని తన మనసులో అర్ధం అనుకుంటానని చెప్పారు. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో పవన్ కే తెలియదని.. జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నట్టా, లేనట్టా అంటూ సెటైర్లు వేశారు.
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన దొరికిపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న 420 అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు.
Also Read : మహిళల పుస్తెలు తెగడానికి జగన్ విధానాలే కారణం : సాధినేని యామిని