Lok Sabha 2024 Polls Nominations : దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ్టి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ప్రతీరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. ఆదివారం సెలవు ఉంటుంది.
Also Read : Lok Sabha Elections 2024 : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశంలోని పది రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాల్గో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉంటుంది. ఆ తరువాత మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read : Malladi Vishnu : బాలకృష్ణ, లోకేశ్లపై ఈసీకి వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు