అధికారంలేకపోతే బతకలేడు… గురువుపై శిష్యుడు సన్సేషనల్ కామెంట్స్

  • Publish Date - August 4, 2020 / 04:53 PM IST

గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి సంచలన వాఖ్యలు చేశారు. కేసులు మాఫీ చేసుకోవడానికి వైసీపీలో గంటా చేరాలనుకుంటున్నారని విమర్శించారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గంటా శ్రీనివాసరావు ఉంటారని ఎద్దేవా చేశారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని మంత్రి అవంతి పేర్కొన్నారు.



సైకిళ్లు, భూ కుంభ కోణాల్లో గంటా, అతని అనుచరులు ఉన్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియజేశానని వెల్లడించారు. రాజధానిపై చంద్రబాబు చేసిన సవాల్ కు వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలే…రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరని మంత్రి అవంతి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు