Kodali Nani : పెద్ద స్టార్ అయిన పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు మాజీమంత్రి కొడాలి నాని. పవన్ కల్యాణ్ కు 40ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు మద్దతు ఉంటే సరిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై ధర్నాలు చేస్తున్న వారు ఎన్టీఆర్ పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన వారిని ముందు తరిమికొట్టాలన్నారు.
200 ఏళ్లు అయినా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కాదన్నారు. అమరావతి గురించి చంద్రబాబు చెబుతున్నదంతా ట్రాష్ అన్నారు కొడాలి నాని. అమాయకులైన రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు చేస్తున్నదే పాదయాత్ర అన్నారు. రైతులెవరూ చంద్రబాబు మాటలు నమ్మొద్దని కొడాలి నాని అన్నారు. తనను కుల బహిష్కరణ చేయడానికి ఓడిపోయిన పది మంది కమ్మ టీడీపీ నాయకులు గుడివాడ వచ్చి తొడలు కొట్టారని అన్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
”చిరంజీవి మద్దతు తనకు అవసరం ఉందని పవన్ కల్యాణ్ భావించరు. ఆయన అవసరాన్ని పవన్ కూడా తీసుకోడు. ఎందుకంటే జాతిపిత, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఉండగా పవన్ కు చిరంజీవి అవసరం ఉండదు. చంద్రబాబే అన్నీ చూసుకుంటారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించి, పందికొక్కుల్లా ఆయనను చంపి, ఆయన రక్త మాంసాలతో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆయన పేరుని జిల్లాకో, గుర్తుండి పోయే కార్యక్రమాలు చేయకుండా, చక్రాలు తిప్పాం అనే వాళ్లని తరిమి తరిమి కొట్టాలి” అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.