Nara Lokesh: 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లు ప్రజలు ఇచ్చారని, అయితే తిరిగి నెల్లూరు జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ విమర్శించారు. జిల్లా నుంచి మూడు కీలక శాఖలు ఉన్నప్పటికీ.. జిల్లాకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం జిల్లాలోని ముత్తుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘నెల్లూరు జిల్లాని వైసీపీ నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. హాఫ్ నాలెడ్జ్ సిల్లీ బచ్చా ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అభివృద్ధి మీద చర్చ అనగానే తోకముడిచాడు. సిల్లీ బచ్చా సీటు గల్లంతు అయ్యింది. అందుకే ఫ్రస్ట్రేషన్లో సొంత పార్టీ నాయకుల్ని, ఆఫ్ ది రికార్డ్ జగన్ని బండ బూతులు తిడుతున్నాడు. పిల్ల కాలువ తవ్వడం రాని వాడు.. పర్సెంటా, అర పర్సెంటా తొందర ఎందుకన్నా, వెయిటు.. వీ విల్ కంప్లీట్ థిస్ ప్రాజక్ట్ బై 2021 డిసెంబర్ అన్నాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది’’ అని ఎమ్మెల్యే అనిల్ని ఉద్దేశించి లోకేష్ విమర్శించారు.
Indian Railway: రైల్వేలో తరుచూ ప్రయాణం చేస్తుంటారు.. అయినా చాలా మందికి ఈ విషయం తెలియదు
ఇక కాకాని గురించి స్పందిస్తూ ‘‘కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు. కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీలో బిజీగా ఉంటాడు. సర్వేపల్లి రూపురేఖలు మార్చేస్తాడని రెండు సార్లు మీరు కాకాణి గోవర్ధన్ రెడ్డిని గెలిపించారు. సర్వేపల్లిని గాలికొదిలేసి కాకాణి దొంగ సంతకాలు, కల్తీ మద్యం, కోర్టు దొంగతనాల్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఆయనకు కోర్టు దొంగ అని పేరు పెట్టాను’’ అని అన్నారు.