Nara Lokesh
Nara Lokesh – Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. రేపటి (ఆదివారం) నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కలిసి నడవాలని కోరుతున్నానని తెలిపారు.
అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి డ్రమ్స్ కొట్టారు. హైదరాబాద్ లోని తన నివాసంలో నారా భువనేశ్వరి నిరసన తెలిపారు.
Nadendla Manohar: జనసేన నినాదం ఇదే.. ఇక పవన్ బలమైన సందేశం ఇస్తారు: నాదెండ్ల మనోహర్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యమేవ జయతే…చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుందన్నారు. ఈ రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలు అందరికీ చేరుతుందని తెలిపారు. చంద్రబాబు నీతి నిజాయితీ కలిగిన నేత అని పేర్కొన్నారు. ఈ పోరాటంతో చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుందన్నారు.