Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రుద్రకోట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
- vamsi
- Updated on- December 8, 2021 / 09:51 AM IST
Road Accident
Road Accident: నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రుద్రకోట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా.. మరొకరిని కావలి ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. చనిపోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది.
