Chandrababu : పొత్తులపై చంద్రబాబు కొత్త మాట
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు.
- bheemraj
- Published On : May 9, 2022 / 02:36 PM IST
Chandrababu (5)
Chandrababu : పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త మాట చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని తెలిపారు. కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు.
వైసీపీ ఇలాంటి డైవర్షన్ రాజకీయాలే చేస్తుందని విమర్శించారు. తన బలహీనతను అధిగమించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక వైసీపీ ఉండదని జగన్ భయం పడుతున్నారని తెలిపారు. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత జగన్ అని ఎద్దేవా చేశారు.
Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
జగన్ సింహం కాదు.. పిల్లి అని ఎద్దేవా చేశారు. 2024లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్థమైందని చెప్పారు. 2024 ఎన్నికల్లే వైసీపీకి చివరి ఎన్నికలు అన్నారు. ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపిచ్చారు. ప్రజలంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు.
