Gudapati Srinivasa Rao: స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన గూడపాటి.. జగన్ కీలక వ్యాఖ్యలు

రేపల్లె నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాస రావు(Gudapati Srinivasa Rao) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ప్రాంత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Tdp leader gudapati srinivasa rao joins ysrcp in presence of ys jagan

  • వైసీపీలోకి గూడపాటి శ్రీనివాసరావు
  • రేపల్లె టీడీపీకి భారీ షాక్
  • సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్

Gudapati Srinivasa Rao: ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాస రావు(Gudapati Srinivasa Rao) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ప్రాంత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ముంగిట సీనియర్ నేతలు పార్టీలు మారడం రాబోయే స్థానిక పోరులో అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది.

Ap High Court: మెగా డీఎస్సీపై బిగ్ అప్‌డేట్.. సీబీఐ విచారణకు హైకోర్టు నో.. వైకాపా ఎమ్మెల్సీ పిటిషన్ కొట్టివేత

సాదరంగా ఆహ్వానించిన జగన్, నేతలకు దిశానిర్దేశం:

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గూడపాటి శ్రీనివాసరావు పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ శ్రీనివాసరావును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ఆయన రాకతో రేపల్లె పట్టణంలో పార్టీకి మరింత బలం చేకూరిందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి మోహన్‌ను గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ముఖ్య నేతల సమక్షం, రేపల్లెలో మారనున్న సమీకరణాలు:

ఈ చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. శ్రీనివాసరావు చేరికతో రేపల్లె ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి ఈ చేరిక ఎంతో దోహదపడుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు.