Kanna Lakshminarayana: బూతులు తిట్టేందుకు మంత్రులెందుకు? దారినపోయే వాళ్ళుకూడా తిట్టగలరు

టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

TDP Leader: మహానాడు అనుకున్న దానికంటే అద్భుతంగా జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన తొలివిడత టీడీపీ మ్యానిఫెస్టో (TDP Manifesto) మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఉపయోగపడేదిలా ఉందని అన్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పారని లక్ష్మీనారాయణ అన్నారు. నిజమైన సామాజిక న్యాయం చేస్తున్న పార్టీ టీడీపీ (TDP) మాత్రమేనని చెప్పారు.

TDP Leader Hariprasad : కొడాలి నానీ..కాపుల గురించి నోటికొచ్చినట్లు వాగితే నాలుక కోస్తాం

టీడీపీ తొలివిడత మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకుల వెన్నులో దడపుడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం‌లో బూతుల పాలన కొనసాగుతుందని, మంత్రులుసైతం ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని, బూతులు తిట్టేందుకు మంత్రులు ఎందుకు? దారినపోయే వాళ్ళుకూడా తిట్టగలరు అంటూ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపానం చేస్తామని చెప్పారు కదా.. చేశారా? అంటూ ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం చేసారా? కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెచ్చి యువతకు ఉద్యోగావకాశాలు తెస్తామన్నారు.. తెచ్చారా? రాష్ట్రంలో కల్తీ విత్తనాలను అరికట్టారా? కొత్త పరిశ్రమలు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం తెస్తామని తెచ్చారా..? అంటూ లక్ష్మీనారాయణ వైసీపీ నేతలను ప్రశ్నించారు.

Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు.. పూర్తి వివరాలు

చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, ఆ అభివృద్ధిని కూడా వైసీపీ ఆగం చేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇదిలాఉంటే.. కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు